శ్రీనగర్: దేశ భద్రతకు ముప్పు అంటూ తన పాస్పోర్ట్ తనకు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తోందని జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ వెల్లడించారు. ట్విటర్ ద్వారా కేంద్రంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతదేశ భద్రతకు ముప్పు ఉందన్న సీఐడీ రిపోర్ట్ మేరకు పాస్పోర్ట్ కార్యాలయం నా పాస్పోర్ట్ ఇవ్వడానికి నిరాకరించింది. 2019, ఆగస్ట్ నుంచి కశ్మీర్ సాధించిన సాధారణ పరిస్థితులు ఇవీ. ఓ మాజీ ముఖ్యమంత్రి పాస్పోర్ట్ కలిగి ఉండటం ఇంత పెద్ద దేశ సార్వభౌమత్వానికి ముప్పు అట అని మెహబూబా ట్వీట్ చేశారు. జమ్ముకశ్మీర్కు ఉన్న ప్రత్యేక హోదాను రద్దు చేసిన తర్వాత 2019, సెప్టెంబర్ నుంచి మెహబూబాతోపాటు ఇతర నేతలను కేంద్రం నిర్బంధంలో ఉంచింది.
ఇవికూడా చదవండి..
సుయెజ్ కాలువలో కదిలిన ఎవర్ గివెన్ షిప్
మయన్మార్ రక్తపాతం.. దారుణం, భయంకరమన్న బైడెన్
ఆ అవార్డులు శార్దూల్, భువనేశ్వర్కే ఇవ్వాల్సింది: విరాట్ కోహ్లి
ల్యాబ్ నుంచి కాదు.. జంతువుల నుంచే కరోనా: డబ్ల్యూహెచ్వో
జీవితంలో మరచిపోలేని సీజన్ ఇది.. టీమిండియాపై రవిశాస్త్రి ప్రశంసలు
రాత్రికి రాత్రే ముంబై ఇండియన్స్ టీమ్తో చేరిన పాండ్యా బ్రదర్స్, సూర్యకుమార్
తీరొక్క ఆప్షన్లతో ధరణి పోర్టల్