బిగ్ బాస్ సీజన్ 5కి సంబంధించిన కార్యక్రమంలో నాగార్జున కొంత మందిని సెట్ చేశారు. కొందరు అదుపు తప్పుతుండడంతో వారికి చురకలు అంటించి సెట్ చేశారు. ముందుగా శుక్రవారం రోజు జరిగిన ఎపిసోడ్కి సంబంధించి కొన్ని విజువల్స్ ప్రసారం చేశారు. అందులో లోబో, ఉమా దేవి పీకల్లోతు ప్రేమలో ఉన్నట్టు కనిపించారు. వారిద్దరిని చూసి హౌజ్మేట్స్ తెగ నవ్వుకున్నారు.
ఇక జైల్లో ఉన్న సన్నీ ఎట్టకేలకు బయటకు వచ్చాడు. వీరందరు నాగ్ ఎంట్రీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూడగా, ఆయన సీరియస్తో ఇంటిసభ్యుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించాడు. ఈ వారం ఎవరెవరు తమ బిహేవియర్ బాలేదు అనుకుంటున్నారో లేచి నిలబడమనగానే ఉమాదేవి, సిరి, లోబో, శ్వేత, యానీ, శ్రీరామ్, సన్నీ లేచి నిలబడ్డారు.
ఉమాదేవి టాస్క్ విషయంలో నోరు పారేసుకున్నట్టు తప్పు ఒప్పుకొని అందరికి క్షమాపణలు చెప్పింది. బూతులు మాట్లాడినందుకు గుంజీలు తీయమంటే అది కూడా తీసింది. ఇక అనీ మాస్టర్ తాను గట్టిగా అరిసానని అందుకే నిలుచున్నాని చెప్పడంతో గట్టిగా వాదించడం తప్పేమి కాదంటూ ఆమెను కూర్చోపెట్టాడు.
ఇక లోబో నువ్వు గతంలో రోజుకు 60 సిగరెట్లు తాగేవాడివి అని నాగ్ గుర్తు చేయడంతో ఇప్పుడు ఏడు మాత్రమే తాగుతున్నానని చెప్పాడు. షో అయిపోయేలోపు సిగరెట్ మానేస్తానని ప్రామిస్ చేశాడు. ఇక శ్వేతాపై నాగ్ ఫుల్ సీరియస్ అయ్యాడు. నామినేషన్ సమయంలో శ్వేత ఆమె ఫేస్పై ఫిజికల్ దాడి చేయడంతో ఆమెకు శిక్ష వేశాడు. అందరి ముందు తన చేతులతో రెండు సార్లు మొహం మీద గట్టిగా కొట్టుకుంది.