కోల్కతా: పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల తుది విడుత పోలింగ్ జరుగుతున్నది. మొత్తం 35 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తుండగా అక్కడక్కడ చెదురుమొదురు ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఉత్తర కోల్కతాలోని మనిక్తలాలో బీజేపీ అభ్యర్థి కళ్యాణ్ చౌబే కారును టీఎంసీ కార్యకర్తలు అడ్డగించారు. ఆయనకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు.
వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులను చెదరగొట్టారు. కళ్యాణ్ చౌబే కారును అక్కడి నుంచి పంపించారు. కాగా, ముప్పై ఏండ్ల మహిళకు బదులుగా 50 ఏండ్ల మహిళ ఓటేసేందుకు వచ్చిందని, దానికి తమ ఏజెంట్ అడ్డుచెప్పడంతో టీఎంసీ కార్యకర్తలు గొడవకు దిగారని, తృణమూల్ దౌర్జన్యానికి ఇది నిదర్శనమని కళ్యాణ్ చౌబే మండిపడ్డారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
నమ్మలేని నిజం: భార్యను ఆమె ప్రియుడికి ఇచ్చి పెండ్లి చేసిన భర్త..!
రష్యా నుంచి భారత్కు రెండు విమానాల్లో భారీగా వైద్య సామాగ్రి
టీకా కోసం 1.23కోట్ల రిజిస్ట్రేషన్లు
ఊసరవెళ్లిలా రంగు మారుతున్న మహిళ చేతివేళ్లు..!