మొదటి సినిమా ఉప్పెనతో ఈ ఏడాది టాలీవుడ్కు బ్లాక్ బాస్టర్ చిత్రాన్ని అందించాడు డైరెక్టర్ బుచ్చిబాబు సాన. 2021లో రూ.100 కోట్లు గ్రాస్ సాధించిన చిత్రంగా నిలిచింది. మైత్రీ మూవీ మేకర్స్-సుకుమార్ రైటింగ్స్ పై నిర్మించిన ఈ చిత్రంతో వైష్ణవ్తేజ్-కృతిశెట్టి ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.
తమ సంస్థకు బ్లాక్ బాస్టర్ హిట్టు అందించిన డైరెక్టర్ బుచ్చిబాబుకు మైత్రీ మూవీ మేకర్స్ ఖరీదైన బెంజ్ జీఎల్సీ కారు బహుమతిగా అందజేశారు. మేకర్స్ అందించిన కారులో బుచ్చిబాబు తన గురువు సుకుమార్తో ఫస్ట్ రైడ్ చేసినట్టు ఫొటోల ద్వారా తెలుస్తోంది. కారులో సుకుమార్, బుచ్చిబాబు చక్కర్లు కొడుతున్న ఫొటోలు ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
ఉప్పెనతో లాభాలు తెచ్చి పెట్టిన హీరోహీరోయిన్లు వైష్ణవ్తేజ్కు రూ.కోటి, కృతిశెట్టికి రూ.25 లక్షలు అదనపు కానుకగా నిర్మాతలు ఇప్పటికే అందించిన సంగతి తెలిసిందే.