గత ఏడాది సినీ ఇండస్ట్రీకు సంబంధించి ఎందరో ప్రముఖులు మృత్యువాత పడ్డారు. ఈ ఏడాది విజృంభిస్తున్న సేకండ్ వేవ్ వలన కూడా సెలబ్రిటీలు కన్నుమూస్తున్నారు. ముఖ్యంగా తమిళ సినీ పరిశ్రమపై కరోనా పంజా విసురుతుంది.గత కొద్ది రోజులలో హాస్య నటుడు వివేక్, దర్శకుడు తామిరై, ఛాయాగ్రహకుడు, దర్శకుడు కేవీ.ఆనంద్, సీనియర్ నటుడు సెల్లముత్తు, నిర్మాత బాబు రాజా, నందగోపాల్ తదితరులు కరోనా, ఇతర సమస్యల కారణంగా కన్నుమూశారు.
తాజాగా నిర్మాత ముత్తు కుమరన్ కరోనాతో కన్నుమూశారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన అతనికి వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో కరోనాకు చికిత్స అందిస్తున్న క్రమంలో అతని ఆరోగ్య పరిస్థితి విషమించి కన్నుమూసారు. ఇటీవల కృష్ణ, స్వాతి జంటగా యాగై అనే చిత్రాన్ని నిర్మించారు ముత్తు. అతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.