సినీ సంగీత కార్యక్రమాలను నిర్వహించడంలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న ప్రముఖ జర్నలిస్ట్, మ్యూజికాలజిస్ట్ రాజా (70) మృతి చెందారు. గత కొద్ది నెలలుగా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తీవ్ర అనారోగ్యంతో గురువారం హైదరాబాద్లో కన్నుమూశారు. పలు పత్రికల్లో సినిమా ఇంచార్జీగా, ‘హాసం’ పక్ష పత్రిక సంపాదకుడుగా సినిమా రంగానికి ఆయన విలువైన సేవలందించారు. సినీ సంగీత, సాహిత్యంపై విశేషమైన జ్ఞానం ఉన్న వ్యక్తిగా రాజాకు పేరుంది. అత్యంత ప్రజాదరణ పొందిన ‘ఆపాతమధురం’ శీర్షికను నిర్వహించిన రాజా దానిపై పుస్తకాన్ని సైతం తీసుకువచ్చారు. రాజా మరణం సినీ రంగానికి తీరనిలోటుగా పలువురు భావిస్తున్నారు.