రాజన్న సిరిసిల్ల : తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని సంగీత దర్శకులు ఆర్పీ పట్నాయక్ గురువారం ఉదయం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన ఆలయ గెస్ట్ హౌస్లో మీడియాతో మాట్లాడారు. వేములవాడ రాజన్నను గతంలో ఐదుసార్లు దర్శించుకున్నాని, ప్రతిసారి ఒక గొప్ప అనుభూతిని పొందానని పేర్కొన్నారు.
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో సినీ పరిశ్రమ అతలాకుతలం అయిందన్నారు. పెద్ద బడ్జెట్ సినిమాలు మధ్యలోనే ఆగిపోవడంతో, నిర్మాతలు ఆర్థికంగా నష్టపోయారని పేర్కొన్నారు. అందుకే తెలంగాణలో కోవిడ్ ఫ్రీ సొసైటీ ఏర్పడాలని స్వామి వారిని ఆకాంక్షించినట్లు పట్నాయక్ చెప్పారు. ఆయన వెంట నిర్మాత రామారావు తదితరులు ఉన్నారు.