అజయ్ ఘోష్, శుభోదయం సుబ్బారావు, జనార్ధన్రావు ప్రధాన పాత్రల్లో ఎన్వీఎల్ ఆర్ట్స్ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. నండూరి శ్రీను, నండూరి రాము నిర్మాతలు. మహేష్ బంటు దర్శకుడు. శనివారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ప్రారంభమైంది. నిర్మాతలు మాట్లాడుతూ ‘హరిశ్చంద్ర, మైరావణ, ధుర్యోధన పాత్రలతో నాటకరంగంలో మా నాన్న గారు ఎన్వీఎల్ నరసింహాచార్యులు చక్కటి గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఆయన పేరు మీదనే ఈ బ్యానర్ను స్థాపించాం. సామాజిక ఇతివృత్తంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. ఆగస్ట్ రెండవ వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. హీరోహీరోయిన్లతో పాటు ఇతర వివరాల్ని త్వరలో వెల్లడిస్తాం’ అని తెలిపారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ఎన్.సుధాకర్రెడ్డి.