బెంగళూరు: దేశంలో కరోనా కేసులు రోజురోజుకు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. కర్ణాటకలో కూడా భారీసంఖ్యలో నమోదవుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 11 లక్షలకుపైగా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. దీంతో వైరస్ మరింత విస్తరించకుండా ప్రభుత్వం అప్రమత్తమవుతున్నది. ఇందులో భాగంగా ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో జరుగుతున్న కుంభమేళాలో పాల్గొన్న యాత్రికులకు కరోనా నెగెటివ్ రిపోర్టు తప్పనిసరి చేసింది. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
రాష్ట్రం నుంచి కుంభమేళాకు వెళ్లివచ్చినవారు తమకు కరోనా లేదని ఆర్టీపీసీఆర్ టెస్టు రిపోర్టు చూపించిన తర్వాతే సాధారణ జీవితం ప్రారంభించాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కే సుధాకర్ స్పష్టం చేశారు. కుంభమేళాలో పాల్గొన్న యాత్రికుల్లో ఇప్పటివరకు 17 వందల మంది కరోనా బారినపడిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని ట్వీట్ చేశారు.
కర్ణాటకలో నిన్న 14,738 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 11.09 లక్షలు దాటాయి. గురువారం ఒక్కరోజే 66 మంది మరణించడంతో మొత్తం మృతులు 13,112కు చేరాయి. ఒక్క బెంగళూరులోనే 10,497 ఉన్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..