బాలీవుడ్ ఇండస్ట్రీ ఈ మధ్య వివాదాలతో హాట్ టాపిక్గా మారుతుంది. ఓ వైపు డ్రగ్స్ కేసులు, మరో వైపు మనీ లాండరింగ్ కేసులు, ఇంకో వైపు పోర్నోగ్రఫీ కేసులతో చర్చనీయాంశంగా మారుతుంది. పోర్నోగ్రఫీ కేసులో రాజ్కుంద్రా అరెస్ట్ కాగా, డ్రగ్స్ కేసులో అర్మాన్ కోహ్లీతో పాటు ఇద్దరు ముగ్గురు నటులు రీసెంట్గా అరెస్ట్ అయ్యారు. ఇక ఇప్పుడు మనీ ల్యాండరింగ్ కేసు జాక్వెలిన్ మెడకు చుట్టుకుంది.
సోమవారం రోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఐదు గంటల పాటు ప్రశ్నించారు. ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో ఈ విచారణ సాగింది. చెన్నైకు చెందిన సుఖేష్ చంద్రశేఖర్ అనే వ్యక్తికి సంబంధించిన 16 లగ్జరీ కార్లు, సముద్రతీరంలోని ఓ విల్లాను ఈడీ అధికారులు సీజ్ చేశారు. ఇతనితో జాక్వలైన్ ఫెర్నాండేజ్కు దగ్గరి సంబంధాలు ఉండటంతో సోమవారం ఆమెను కూడా విచారించారు. దీంతో హిందీ చిత్ర పరిశ్రమలో ఉద్విగ్న వాతావరణం నెలకొంది.
జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ప్రస్తుతం అక్షయ్ కుమార్తో కలిసి రామ్ సేతు, బచ్చన్ పాండే సినిమాలు చేస్తోంది. మరోవైపు క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే సినిమా చేస్తుంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్తో పాటు జాక్వెలిన్ కథానాయికగా నటిస్తుంది.