తుర్కపల్లి, జూన్ 25: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా గ్రామాన్ని అన్ని హంగులతో అభివృద్ధి చేసుకో వాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ఈనెల 22న ముఖ్య మంత్రి కేసీఆర్ వాసాలమర్రిలో నిర్వహించిన గ్రామ సభలో పాల్గొని గ్రామాభివృద్ధి కోసం అభివృద్ధిల కమిటీలను వేసుకోని ముందుకు సాగాలని ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం డీఆర్డీ వో ఉపేందర్రెడ్డి గ్రామ సభను ఏర్పాటు చేసి గ్రామాభివృద్ధి క మిటీలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ.. జిల్లాలో 421 గ్రామ పంచాయతీలు ఉండగా ముఖ్యమంత్రి కేసీఆర్ వాసాలమర్రి గ్రామాన్ని దత్తత తీసుకో వడం గ్రామస్తులు చేసుకున్న అదృష్టమన్నారు. గ్రామా భివృద్ధి కై ముఖ్యమంత్రి కేసీఆర్ మనపై పెట్టిన బాధ్యతను సమష్టి కృషి తో గ్రామంలో శ్రమదానం చేసి ఐక్యతను చాటుకోవాలన్నారు. స్త్రీ శక్తి ఎంతో గొప్పదని ఎన్నో ఇబ్బందులు ఉన్న కుటుంబా న్ని చక్కదిద్దేది స్త్రీలేనని అన్నారు.
అలాంటి మహిళలు గ్రామ అభివృద్ధిలో మగవారికి దీటుగా నిలిచి ముందుకు సాగితే ఒక్క నెలలోనే గ్రామ స్వరూపం మారిపోతుందన్నారు. అంతేకా కుండా యువత పాత్ర సైతం గ్రామాభివృద్ధ్దిలో కీలక మన్నా రు. గ్రామంలో 2300మంది జనాభా ఉండగా గ్రామ సభలో కొంత మందికి మాత్రమే అభివృద్ధి కమిటీలో చోటు దక్కడం వారి అదృష్టమన్నారు. అభివృద్ధి కమిటీలో ఎన్నికైన సభ్యులకు ఎలాంటి జీతాలు ఉండవని స్వచ్ఛందంగా తమ సమయాన్ని కేటాయించి గ్రామాభివృద్ధికి పాటుపడాలన్నారు.
నేటి నుంచి రెండు నెలల పాటు గ్రామ కమిటీ సభ్యులు గ్రామ స్తులు యువత సహకారంతో గ్రామాభివృద్ధి కోసం విశ్వాసంగా శ్రమదానం చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ మనపై ఉంచిన బాధ్య తను నిరూపించుకోవాలన్నారు. గ్రామాభివృద్ధి కోసం ఎన్ని నిధులైన ఖర్చు చేసేందుకు సీఎం కేసీఆర్ సిద్ధంగా ఉన్నారన్నా రు. గ్రామంలో ఉన్న ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు సలహా లు, సూచనలు గ్రామాభివృద్ధికి ఎంతో అవసరమని వారంతా అభివృద్ధి కమిటీ సభ్యులకు మార్గదర్శకులుగా ఉండాలన్నారు. ప్రతిఒక్కరూ ఐక్యమత్యంతో ఉంటు రాజకీయ విభేదాలకు తా వు లేకుండా అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ గ్రా మాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా నిలుపేలా కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా వాసాలమర్రి ఫ్రెంఢ్స్ అసోసియేషన్ సభ్యులు హరితహారంలో పాలుపంచుకుంటూ.. కమిటీతో కలిసి పని చేస్తామని తెలుపడంతో పాటు గ్రామాభివృద్ధికి రూ.21వేలను డీఆర్డీవో ఉపేందర్రెడ్డికి అందజేశారు.
వాసాలమర్రి గ్రామాభివృద్ధికి 7కమిటీల ఎంపిక
వాసాలమర్రి గ్రామంలో కలెక్టర్ పమేలా సత్పతి సమక్షంలో గ్రామాభివృద్ధి కమిటీలను ఎంపిక చేశారు. గ్రామాభివృద్ధి కో సం ప్రధాన కమిటీతో పాటు మరో 7 సబ్కమిటీలు హరితహా రం, పారిశుధ్యం తాగునీరు, శ్రమదానం, ఆరోగ్యం, వ్యవసా యం, మౌలికవసతులు, మార్కెటింగ్ కమిటీలను ఏర్పాటు చే శారు. ప్రతి మంగళ, ఆదివారాలు గ్రామంలో కమిటీ సభ్యులు గ్రామంలో శ్రమదానం చేయనున్నట్లు డీఆర్డీవో తెలిపారు. ఈ సమావేశంలో సర్పంచ్ పోగుల ఆంజనేయులు, ఎంపీటీసీ ప లుగుల నవీన్కుమార్, తహసీల్దార్ జ్యోతి, ఎంపీడీవో ఉమా దేవి, ఎంపీవో శ్రీమాలిని, వాసాలమర్రి ప్రెంఢ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పలుగుల రామకృష్ణ, సభ్యులు రమేశ్, మురళి, మ హేశ్, పాండరి, సురేశ్, రాజు, రమణయ్య, గోపాల్, మనోహ ర్, ఉప సర్పంచ్ మధు, గ్రామస్తులు కొక్కోండ సత్యనారా యణ, బాలురాజు, కృష్ణ, జహంగీర్ తదితరులు ఉన్నారు.
కలెక్టర్ను కలిసిన సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు
యాదగిరిగుట్ట రూరల్: నూతన కలెక్టర్ పమేలా సత్పతిని యాదగిరిగుట్ట సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు కర్రె వెంక టయ్య శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్కు యాదా ద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ప్రసాదాన్ని అందించి శుభాకాం క్షలు తెలిపారు. గ్రామాల అభివృద్ధికి సహాకారం అందించాలని కలెక్టర్ను కోరినట్లు కర్రె వెంకటయ్య తెలిపారు.
గ్రామాన్ని దత్తత తీసుకోవడం సంతోషంగా ఉంది
వాసాలమర్రి గ్రామాన్ని ముఖ్యమం త్రి కేసీఆర్ సార్ దత్తత తీసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. ఇటీవల సారు గ్రామానికి వచ్చి గ్రామస్తులం దరినీ ఐక్యమత్యంతో ఉండి గ్రామా న్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పారు. సీఎం సార్ ఆశయాలకు అనుగుణంగా గ్రామాభివృద్ధిల కమి టీలో సభ్యుడిగా చేరాను. నాకున్న కాళీ సమయాన్ని గ్రామా భివృద్ధికి కేటాయించి నావంతు గ్రామాభివృద్ధికి కృషి చేస్తాను.
– చిన్నం దానయ్య, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యుడు
గ్రామాభివృద్ధిలో పాలుపంచుకోవడం అదృష్టం
ఎన్నో ఏండ్లుగా నిరాధరణకు గురై అభివృద్ధిలో చాలా వెనుకబడిన మా గ్రామంపై ముఖ్యమంత్రి కేసీఆర్ చల్ల ని చూపు పడింది. గ్రామాభివృద్ధికి ఎ న్ని నిధులైన కేటాయించి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని మాకు భరోసా కల్పించారు. సీఎం సార్ ఆశయాలకు అనుగుణంగా గ్రామం అభివృద్ధి కోసం శ్రమధానం చేసి అభివృద్ధిలో భాగ స్వామిని అవుతాను.
– కొత్తింటి కృష్ణ, వాసాలమర్రి గ్రామస్తుడు