యాంకర్గా, బుల్లితెర నటిగా తెలుగు ప్రేక్షకులని అలరించిన ముద్దుగుమ్మ సమీరా షరీఫ్. 2006 లో ఆడపిల్ల అనే సీరియల్ తో కెరీర్ ప్రారంభించిన సమీరా.. ప్రభాకర్తో ఎక్కువ సీరియల్స్ చేసింది. ముద్దుబిడ్డ, అభిషేకం, భార్యమణి, మూడు ముళ్ల బంధం వంటి సీరియల్స్తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అనంతరం తమిళంలోను పలు సీరియల్స్ చేసింది. ఆ సమయంలో సినీ నటి సన కుమారుడు సయ్యద్ అన్వర్తో ప్రేమలో పడింది. ఇద్దరు తమ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.
తాజాగా సమీరా తన సోషల్ మీడియా ద్వారా మేమిద్దరం తల్లిదండ్రులం కాబోతున్నాం అనే పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్లో సమీరా ఆమె భర్త రెడ్ కలర్ టీ షర్ట్స్ ధరించి సంతోషంగా కనిపిస్తున్నారు. అయితే సమీరా గుడ్ న్యూస్ చెప్పడంతో నెటిజన్స్ ఆమెకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇటీవలి కాలంలో అదిరింది అనే షోకు యాంకర్గా పని చేసిన సమీరా అరవింద సమేత అనే సీరియల్లోను నటించింది.