మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ మరికొద్ది రోజులలో ముగియనుంది. ఈ సినిమా తర్వాత మలయాళంలో సూపర్ హిట్గా నిలిచిన లూసిఫర్ రీమేక్ చేయనున్నాడు. ఈ చిత్రానికి తని ఒరువన్ ఫేం రీమేక్ స్పెషలిస్ట్ మోహన్ రాజాను దర్శకుడిగా ప్రకటించారు. ఆయన ఇటీవల రీమేక్ స్క్రిప్టు ను రెడీ చేస్తూ కాస్టింగ్ పైనా దృష్టి సారించారు. అయితే మోహన్ రాజా తన స్క్రిప్టుతో చిరుని మెప్పించలేకపోయారని, ఈ క్రమంలో మరో దర్శకుడు ఫ్రేంలోకి వచ్చారని వార్తలు వచ్చాయి.
ఈ రోజు మోహన్ రాజా బర్త్డే కావడంతో పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ కొణిదెల సంస్థ పోస్టర్ విడుదల చేసింది. దీంతో లూసిఫర్ రీమేక్ను మోహన్ రాజా తెరకెక్కిస్తున్నట్టు కన్ఫాం అయింది. కోవిడ్ సెకండ్ వేవ్ వల్ల మాత్రమే ఈ సినిమా చిత్రీకరణ ఆలస్యమవుతోందని తెలిసింది. లాక్ డౌన్లు ముగిశాక ఆచార్య పెండింగ్ చిత్రీకరణ పూర్తి చేయగానే తదుపరి ప్రాజెక్ట్ పై మరిన్ని వివరాల్ని వెల్లడిస్తారు.