హర్షా నర్రా, నికీషా రంగ్వాలా, మిషానారంగ్ నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘మిస్సింగ్’. శ్రీను జోస్యుల దర్శకుడు. భాస్కర్ జోస్యుల, లక్ష్మీ శేషగిరిరావు నిర్మాతలు. ఈ సినిమా ట్రైలర్ను ఇటీవల విడుదల చేశారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘థ్రిల్లర్ కథాంశంతో సాగే చిత్రమిది. ఆద్యంతం ఉత్కంఠను పంచుతుంది. ఓ విభిన్నమైన సబ్జెక్ట్తో తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతినందిస్తుంది’ అన్నారు. ట్రైలర్ చాలా ఆసక్తికరంగా సాగిందని కార్యక్రమానికి ఆతిథులుగా విచ్చేసిన దర్శకుడు మారుతి, నిర్మాత బన్నీ వాసు తెలిపారు. నిర్మాత భాస్కర్ మాట్లాడుతూ ‘కరోనా వల్ల సినిమా ఆలస్యమైంది. థ్రిల్లర్ జోనర్లో వైవిధ్యంగా ఉండే కథ ఇది. అందరిని ఆకట్టుకుంటుందనే నమ్మకముంది’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అజయ్ అరసాడ, కథ, మాటలు, స్క్రీన్ప్లే: శ్రీని జోస్యుల.