అప్పుడే రెక్కలొచ్చి.. ఎప్పుడెప్పడు ఎగురుదామా అని చూస్తున్నట్లు ఉన్న ఈ వీటిని చూశారా ! వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలంలోని బూరుగుమళ్లలో కనిపించిన సైబీరియన్ కొంగల పిల్లలు ఇవి. ప్రతి ఏటా వానకాలం తర్వాత సైబీరియన్ పక్షులు ఇక్కడికి చేరుకుంటాయి. ఇక్కడి చెట్లపైనే గూడు ఏర్పాటు చేసుకుని గుడ్లు పెడతాయి. వాటిని పొదిగి పిల్లలకు జన్మనిస్తాయి. వాటికి రెక్కలొచ్చి స్వతహాగా ఎగిరే స్థితి వరకు సైబీరియన్ పక్షులు కంటికిరెప్పలా కాపాడుకుంటాయి. ఆ తర్వాత అక్కడి నుంచి వాటి స్వస్థలాలకు ఎగిరిపోతాయి. ఏటా వచ్చి పోయే ఈ విదేశీ అతిథులు.. తమ కుటుంబ సభ్యుల వలె కలిసిపోతున్నాయంటూ గ్రామస్తులు ఎంతో మురిసిపోతున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి