ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గులాబీ శ్రేణుల సంబురాలు
నాగార్జునసాగర్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు
పటాకులు కాల్చి..మిఠాయిలు పంపిణీ..
జై తెలంగాణ నినాదాలతో మారుమోగిన జిల్లా..
మంచిర్యాలటౌన్, మే 2 : తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్కు తిరుగులేదని, ఏ ఎన్నిక వచ్చినా కారు జోరు కొనసాగుతుందని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ భారీ మెజార్టీతో గెలుపొందిన సందర్భంగా ఆదివారం సాయంత్రం మంచిర్యాలలో టీఆర్ఎస్ నాయకులు విజయోత్సవం నిర్వహించారు. ఐబీ చౌరస్తాలో పటాకులు కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు. జై తెలంగాణ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో రెండు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్కు చోటు లేదని, ఈ రెండు పార్టీలకు నాగార్జునసాగర్ ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. కార్యక్రమంలో నడిపెల్లి ట్రస్ట్ చైర్మన్ విజిత్రావు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గాదె సత్యం, కౌన్సిలర్ సుదమల్ల హరికృష్ణ, పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశ్, నాయకులు గోగుల రవీందర్రెడ్డి, గట్టయ్య, జెట్టి చరణ్, పూదరి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ గెలుపు సంబురాలు
కౌటాల, ఏప్రిల్ 2 : నాగార్జునసాగర్లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ ఘన విజయం సాధించడంతో మండలంలోని కుమ్రంభీం చౌరస్తాలో ఆదివారం టీఆర్ఎస్ నాయకులు సంబురాలు చేసుకున్నారు. పటాకులు కాల్చి నినాదాలు చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, సర్పంచ్ వొజ్జల మౌనిశ్, ఎంపీటీసీలు మనీశ్, ఎంకే మండల్, కో ఆప్షన్ సభ్యుడు అజ్మత్ అలీ, ఉపసర్పంచ్ తిరుపతి, నాయకులు రవీందర్ గౌడ్, సంతోష్, డబ్బా బాపు, నయీం అహ్మద్, రాంచందర్, ప్రభాకర్ గౌడ్, అశోక్, సోల్ల బాపు, బాబురావు, మండల నాయకులు పాల్గొన్నారు.