ప్రపంచ బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ తొలిసారి ఇండియన్ స్క్రీన్పై కనిపించబోతున్నారు. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘లైగర్’ చిత్రంలో ఈ బాక్సింగ్ లెజెండ్ ప్రతినాయకుడి పాత్రను పోషించనున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు విజయ్ దేవరకొండ. ‘భారతీయ వెండితెరపై తొలిసారి బాక్సింగ్గాడ్ నటిస్తున్నారు. ది బ్యాడెస్ట్ మ్యాన్ ఆన్ ది ప్లానెట్, ది లెజెండ్, ది బీస్ట్, ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ అని ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఓ ఫొటోను షేర్ చేశారు. ‘తన శక్తివంతమైన పంచ్లతో బాక్సింగ్ బరిలో ఎందరినో మట్టికరిపించిన మైక్ టైసన్ ‘లైగర్’ చిత్రంలో మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్లో నైపుణ్యం కలిగిన ఐరన్మైక్ పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ గోవాలో జరుగుతున్నది. రొమాంచితమైన పోరాటఘట్టాల్ని తెరకెక్కిస్తున్నాం. త్వరలో థియేటర్లలో చిత్రాన్ని విడుదల చేస్తాం’ అని చిత్రబృందం తెలిపింది. అనన్యపాండే, రమ్యకృష్ణ, రోనిత్రాయ్, విష్ణురెడ్డి, అలీ, మకరంద్దేశ్పాండే తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: విష్ణుశర్మ, నిర్మాతలు: పూరి జగన్నాథ్, కరణ్జోహార్, ఛార్మి, అపూర్వ మెహతా, నిర్మాణ సంస్థలు: పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్, దర్శకుడు: పూరి జగన్నాథ్.