అగ్ర కథానాయకుడు చిరంజీవి, దర్శకుడు మోహర్ రమేష్ కలయికలో రూపొందనున్న చిత్రం ‘భోళా శంకర్’ నవంబరు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. కాగా ఈ చిత్రానికి స్వరాలు అందించే లక్కీఛాన్స్ను ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ దక్కించుకున్నాడు. ఇంతకుముందు ఛలో, భీష్మ వంటి విజయవంతమైన చిత్రాలకు మహతి స్వరాలను అందించిన సంగతి తెలిసిందే. ‘భోళా శంకర్’ కథలో ఎన్నో విభిన్నమైన స్వరాలకు, హైస్టాండర్డ్స్ నేపథ్య సంగీతానికి స్కోప్ వుందని చిత్రబృందం తెలిపింది. ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని చిరు సినిమాకు అందరిని అలరించే పాటలను ఇచ్చేందుకు మహతి కసరత్తులు మొదలుపెట్టాడని చిత్రబృందం తెలియజేసింది.