మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఎన్ని సినిమాలు చేస్తున్నాడు అని చెప్పడం కూడా కష్టమే. ఎందుకంటే అన్ని సినిమాలకు కమిట్ అయ్యాడు ఈయన. ప్రస్తుతం అయితే సెట్స్ పై ఉన్న సినిమా కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఆచార్య. ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా ఆగిపోయింది. అయితే త్వరలోనే మొదలు పెట్టాలని చూస్తున్నాడు చిరంజీవి. ఇదిలా ఉంటే ఈ చిత్రంతో పాటు మరో మూడు సినిమాలు కూడా లైన్ లోనే ఉన్నాయి. అయితే ఏది ముందు వస్తుంది.. ఏది తర్వాత విడుదల అవుతుందనేది మాత్రం ఇప్పట్లో చెప్పడం కష్టమే అవుతుంది. లూసీఫర్ రీమేక్ అలాగే ఉంది. ఈ చిత్రం కోసం దర్శకుడు జయం రాజా చాలా ప్రయత్నిస్తున్నాడు. మరోవైపు మెహర్ రమేష్ కూడా వేదాళం రీమేక్ కోసం కథ సిద్ధం చేసాడు. ఈ చిత్ర షూటింగ్ చిరంజీవి లేకుండానే మొదలైంది.
గతేడాది సెప్టెంబర్ లోనే కోల్ కత్తా వెళ్లి అక్కడ కొన్ని సన్నివేశాలు చిత్రీకరించుకుని వచ్చాడు. ఈ సినిమా కథను తెలుగు ఆడియన్స్ మనసుకు నచ్చేలా మూడేళ్లుగా మారుస్తూనే ఉన్నాడు మెహర్ రమేష్. చివరికి చిరు మెప్పు పొందాడు. అయితే ముందు నుంచి మెహర్ రమేష్ దర్శకుడు అని తెలిసిన తర్వాత మెగా ఫ్యాన్స్ లో కంగారు అయితే కనిపిస్తూనే ఉంది. కానీ అన్నీ చిరంజీవి దగ్గరుండి చూసుకుంటారని నమ్మకంతో ఉన్నారు వాళ్లు. అయితే ఇప్పుడు చిరంజీవి లేని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడు మెహర్. అయితే ముందు ఆచార్య పూర్తవ్వాలి.. ఆ తర్వాత లూసీఫర్ అయిపోవాలి.. ఆ తర్వాత వేదాళం రీమేక్ వైపు చూస్తాడు చిరంజీవి. మరి అప్పటి వరకు కూడా మెహర్ మిగిలిన పార్ట్ పూర్తి చేస్తాడా అనేది చూడాలి.