దివంగత నటుడు శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘రాసిపెట్టుంటే’ అనే టైటిల్ను ఖరారు చేశారు. సి.కె ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సి.కల్యాణ్ నిర్మిస్తున్నారు. నందు మల్లెల దర్శకుడు. శ్రీహరి జయంతి సందర్భంగా ఆదివారం ఈ సినిమా టైటిల్ పోస్టర్ను చిత్రబృందం విడుదలచేసింది. సూర్యుడు అస్తమిస్తున్న వేళలో ఫెన్సింగ్ వేసిన ఓ ప్రాంతం నుంచి బస్ వెళుతున్నట్లుగా తీర్చిదిద్దిన పోస్టర్ ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ‘యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో మేఘాంశ్ పాత్ర సరికొత్తగా ఉంటుంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో వెల్లడిస్తాం’ అని నిర్మాత తెలిపారు.