మేడ్చల్, జూన్ 7(నమస్తే తెలంగాణ): మెయిల్ అనుబంధ సంస్థయైన మేఘా గ్యాస్ తన వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తున్నది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని కీసర వద్ద సంస్థ ఏర్పాటు చేసిన 100వ సీఎన్జీ స్టేషన్ను బుధవారం కంపెనీ సీఈవో వెంకటేశ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వచ్చే ఏడాది చివరినాటికి 400 సీఎన్జీ స్టేషన్లను ప్రారంభించేలా ప్రణాళికను రూపొందించుకున్నట్లు చెప్పారు.
కీసర వద్ద ఏర్పాటు చేసిన వందో సీఎన్జీ స్టేషన్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉన్నదని, దీంతోపాటు దేశవ్యాప్తంగా 2 లక్షల పీఎన్జీ(పైపుల ద్వారా సహజ వాయువు) కనెక్షన్లు ఇవ్వాల కున్నట్టు చెప్పారు. ఇప్పటి వరకు తెలంగాణలో 46, ఆంధ్రప్రదేశ్లో 28, కర్ణాటకలో 12, ఉత్తర్ప్రదేశ్లో 4, మధ్యప్రదేశ్లో 4, తమిళనాడులో 3, పంజాబ్లో 3 సీఎన్జీ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు.