Mega Star appeal | ఏ ప్రకృతి విపత్తు వచ్చినా ఆదుకోవడానికి ముందుగా స్పందించేది సినీ పరిశ్రమేనని, కానీ కరోనా వల్ల ఆ సినీ పరిశ్రమే సంక్షోభంలో చిక్కుకుందని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. నిర్మాణ వ్యయం పెరిగిపోయిందని, సర్దుబాటు ధోరణికి చాన్స్ లేదని చెప్పారు. ఈ పరిస్థితుల్లో సినీ పరిశ్రమను ఆదుకునేందుకు ముందుకు రావాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు చిరంజీవి విజ్ఞప్తి చేశారు.
అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన సినిమా లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ.. సినీ పరిశ్రమ సాధక, బాధకాలను గుర్తించి సాయం చేయాలని కోరారు. తమ మీద నమ్మకంతో సినిమాలు చేసే వారిని నిరాశ పర్చకుండా వారికి వినోదాన్ని పంచేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని చెప్పారు.
కోవిడ్ వల్ల నాలుగైదు నెలలు సినిమాల షూటింగ్ జరుగలేదని, దీంతో సినీ కార్మికుల కుటుంబాలు పని లేక అల్లాడిపోయాయని చిరంజీవి అన్నారు. సినిమా హీరోలు, హీరోయిన్లు, దర్శక నిర్మాతలతోపాటు సినీ కార్మికులు కలిస్తేనే సినీ పరిశ్రమ అన్నారు.
కరోనా వేళ సినిమాల నిర్మాణం పూర్తయినా మరో సినిమా చేయాలా? వద్దా.. అన్న సందిగ్ధంలో పడిపోయామని మెగాస్టార్ అభిప్రాయ పడ్డారు. ఆచార్య సినిమా చిత్రీకరణ పూర్తయింది.. ఎప్పుడు.. ఎలా రిలీజ్ చేయాలని.. రెవెన్యూ వస్తుందా అనే ప్రశ్నలు వెంటాడుతున్నాయని అన్నారు. దీనికి లవ్ స్టోరీ దారి చూపుతుందని ఆశిస్తున్నానని చిరంజీవి చెప్పారు.
ఎంత రెవెన్యూ వస్తుందని చెప్పలేమని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాలు తమకు వెసులుబాటుతోపాటు ధైర్యాన్నివ్వాలని కోరారు. వీలైనంత త్వరగా చిత్ర పరిశ్రమకు మేలు చేసే ఉత్తర్వులు జారీ చేయండంటూ రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఆ విషయంలో మా అమ్మ చెప్పినా వినను.. ఓపెన్ అయిన రష్మిక
చీరలు అంటే చాలా ఇష్టమే.. కానీ అదొక్కటే సమస్య అంటున్న ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేశ్
Siri: సిరి షర్ట్ లోపల చేయి పెట్టిందెవరు.. వీడియో చూపించి గుట్టు విప్పిన నాగ్
తల్లిదండ్రులపై కేసు పెట్టిన తమిళ హీరో విజయ్.. కారణం ఏంటంటే..