కోల్కతా: పశ్చిమబెంగాల్లో అధికార టీఎంసీ పార్టీ ఎమ్మెల్మే ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం ఎమ్మెల్యే మదన్ మిత్రా ఇంట్లో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ప్రమాదాన్ని మందే గ్రహించిన ఆయన ఇంట్లో నుంచి బయటకు వెళ్లారు. కుటుంబ సభ్యులంతా క్షేమంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. గ్రౌండ్ ఫ్లోర్లో మంటలు చెలరేగాయని అధికారులు చెప్పారు. ఈ ప్రమాదానికి షార్ట్ సర్య్కూటే కారణమని భావిస్తున్నామన్నారు. కాగా, అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, దీనిపై విచారణ ప్రారంభించామని పోలీసులు వెల్లడించారు.
ఇది తమ పూర్వీకుల ఇళ్లు. ఇవాళ ఉదయం ఇంట్లో ఏదో పేళుళ్ల శబ్ధం వినిపించింది. దీంతో అగ్ని ప్రమాదం జరుగుతుందని గ్రహించాను. వెంటనే కుటుంబ సభ్యులమంతా ఇంట్లో నుంచి బయటకు వెళ్లామని మదన్ మిత్రా చెప్పారు.