తొలి చిత్రం ‘ఉప్పెన’తో చక్కటి విజయాన్ని సొంతం చేసుకున్నారు యువ కథానాయకుడు వైష్ణవ్తేజ్. ప్రస్తుతం ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా వెంకీ కుడుముల (‘ఛలో’ ‘భీష్మ’ చిత్రాల ఫేమ్) దర్శకత్వంలో వైష్ణవ్తేజ్ ఓ సినిమాలో నటించబోతున్నారని తెలిసింది. దీనిని మైత్రీమూవీ మేకర్స్ సంస్థ తెరకెక్కించనుందని సమాచారం. వెంకీ కుడుముల చెప్పిన కథలో కొత్తదనం నచ్చడంతో వైష్ణవ్తేజ్ ఈ సినిమాకు పచ్చజెండా ఊపారని చెబుతున్నారు. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు తెలిసింది. ఇదిలావుండగా వైష్ణవ్తేజ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో ‘కొండపొలం’ నవల ఆధారంగా రూపొందిస్తున్న చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుంది. తమిళ దర్శకుడు గిరీషయ్యతో వైష్ణవ్తేజ్ ఇటీవలే ఓ సినిమాకు అంగీకరించిన విషయం తెలిసిందే.