వ్యవసాయ యూనివర్సిటీ, జూన్ 4 : పోషకాహార లోపాన్ని అధిగమించి.. సమతుల ఆహారాన్ని అందించడానికి న్యూట్రీగార్డెన్ (పోషకాహార తోట) పెంప కం చాలా సులభమైందని, పెరటి తోట పెంపకాన్ని కొద్దిగా మార్చి న్యూట్రీగార్డెన్ మోడల్ను అభివృద్ధి పర్చేందుకు ప్రణాళిక సిద్ధమైందని ప్రొ. జయశంకర్ తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీ ఉపకులపతి డా. ప్రవీణ్రావు అన్నారు. శుక్ర వారం ఆయన మాట్లాడుతూ.. ఒక కు టుంబానికి కావాల్సిన రోజు వారి పోషకాలను వివిధ రకాల ఆకు కూరలు, కూరగాయలు , పండ్లు ద్వారా అందించడమే న్యూట్రీగార్డెన్ ఉద్దేశమన్నారు. ప్ర తి ఇంట్లో మూడు రకాల ఆకు కూరలు , 1-2 రకాల పండ్లమొక్కలు పెంచడం ద్వారా ఏడాది మొత్తం పోషకాహారాన్ని అందించడమే కాకుండా కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చవచ్చునన్నారు. న్యూట్రీగార్డెన్ మోడల్ను తొలిసారిగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలు ప్రయోగాత్మకంగా చేపట్టాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం న్యూట్రీగార్డెన్ పేరుతో గిరిజన ప్రాంతా లు ఎక్కువగా ఉన్న ఆరు జిల్లాల్లో 29 ఊర్లను ఈ కార్యక్రమానికి ఎంపిక చేసి కార్యాచరణకు శ్రీకారం చుట్టిందన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం కూడా తమ వంతుగా యూనివర్సిటీ అనుబంధ కళాశాలల్లో న్యూట్రీగార్డెన్స్ను పెంచడానికి నిర్ణయం తీసుకున్నదన్నారు.
పాఠశాల విద్యలో వ్యవసాయాన్ని పాఠ్యాంశంగా చేర్చి.. పిల్లల్లో న్యూట్రీగార్డెన్ మోడల్పై అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ సుధీర్ కుమార్, రీసెర్చ్ డైరెక్టర్ డా.జగదీశ్వర్ , ఉన్నతాధికారులు పద్మజా, సీమ , ఇమ్మానియేలు తదితరులు పాల్గొన్నారు.