హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఇవాళ సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరేట్, పోలీసు కమిషనరేట్, ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. సీఎం కేసీఆర్ ఆదివారం ఉదయం 11.45 గంటలకు హెలికాప్టర్లో సిద్దిపేటకు చేరుకుంటారు. ఉదయం 11.50 గంటలకు సిద్దిపేట పట్టణంలో నూతనంగా నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం సిద్దిపేట శివారులో పోలీస్ కమిషనరేట్ కార్యాలయం భవన్ని, సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని సీఎం ప్రారంభిస్తారు. తర్వాత ప్రజా ప్రతినిథులు, అధికారులతో సమావేశమవుతారు. అటునుంచి కామారెడ్డి జిల్లాకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డి సమీకృత కలెక్టరేట్తోపాటు ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఆయా జిల్లాల్లోని గ్రామాల్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించే అవకాశం ఉన్నది.
కాగా, సీఎం కేసీఆర్ సోమవారం వరంగల్ జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. కాళోజీ యూనివర్సిటీ, వరంగల్ అర్బన్ కలెక్టరేట్లను ప్రారంభిస్తారు. వరంగల్ సెంట్రల్ జైలు ప్రాంగణంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ దవాఖాన భవన నిర్మాణానికి భూమి పూజచేయనున్నారు. ఈనెల 22న యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామానికి వెళ్తారు.
CM KCR inaugurates Siddipet Collectorate and several development programmes