తెలంగాణలో సినిమా ఇండస్ట్రీ పరిస్థితి బాగానే ఉన్నాయి కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. అక్కడ వైరస్ కారణంగా మూతపడిన థియేటర్లు ఇప్పటివరకు ఇంకా కొన్ని తెరవలేదు. వరుసగా సినిమాలు విడుదల అవుతున్న కూడా ఇప్పటి వరకు నాలుగు షోలకు అనుమతి ఇవ్వలేదు. ప్రభుత్వం అన్నింటికీ మించి టికెట్ల విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తోంది జగన్ ప్రభుత్వం.
గవర్నమెంట్ నిర్ణయించిన రేటు కాకుండా పెంచి అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామంటూ థియేటర్ల యజమానులకు ఇప్పటికే సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దాంతో అటు డిస్ట్రిబ్యూటర్లు.. ఇటు నిర్మాతలు ఆలోచనలో పడిపోయారు. ఈ నేపథ్యంలోనే నేరుగా ఆయనను కలిసి.. తమ కష్టాలను ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితులను వివరించాలని ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోసం కొందరు ఇండస్ట్రీ పెద్దలు ప్రయత్నించారు. కానీ దీనికి అతడి నుంచి నో అనే సమాధానం వచ్చింది.
కేవలం చిరంజీవితో పాటు మరో ఇద్దరిని మాత్రమే కలవడానికి జగన్ పిలుపు ఇచ్చాడు.
ఈ క్రమంలోనే అసలు ఏయే విషయాలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలి అనే విషయంపై చర్చించడానికి ఇండస్ట్రీ పెద్దలు అంతా కలిసి.. చిరంజీవి ఇంట్లో మరోసారి మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. దీనికి ఇండస్ట్రీ నుంచి చాలా మంది హీరోలు దర్శకులు నిర్మాతలు హాజరయ్యారు. నాగార్జున, సురేష్ బాబు, దిల్ రాజు, ఆర్ నారాయణ మూర్తి తదితర సినిమా పెద్దలు ఈ మీటింగ్ లో కనిపించారు.
అయితే మరోసారి నందమూరి బాలకృష్ణ మాత్రం కనిపించలేదు. తనను కావాలనే మీటింగ్ లకు దూరం పెడుతున్నారు అంటూ గతంలో బాలయ్య ఆరోపించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆ వ్యాఖ్యలు చాలా సంచలనం సృష్టించాయి. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి భూములు పంచుకుంటున్నారా అంటూ సీరియస్ కామెంట్స్ చేశాడు బాలయ్య.
తనకు మర్యాద ఇచ్చి కలుపుకుపోతే తాను కూడా అందరితో కలిసి పోతాను.. కలవకపోతే వదిలేస్తాను అంటూ అప్పుడే చెప్పాడు బాలకృష్ణ. అయితే ఈసారి కూడా మీటింగ్ లో బాలయ్య లేకపోవడంతో పలు అనుమానాలకు తెర లేస్తుంది.
ఈయనను కావాలని దూరం పెడుతున్నారు అంటూ నందమూరి అభిమానులు కూడా సోషల్ మీడియాలో గోల పెడుతున్నారు. ఏదేమైనా కూడా జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే ఇండస్ట్రీ పెద్దల బాలయ్యను దూరం పెడుతున్నారో లేదంటే వాళ్లనే బాలయ్య దూరం పెడుతున్నారో అర్థం కావడం లేదు.