‘నేను స్క్రిప్ట్ రచనకు చాలా సమయం తీసుకుంటా. అందుకే తక్కువ సినిమాలు చేశాను’ అని అన్నారు మేర్లపాక గాంధీ. ‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్’ ‘ఎక్స్ప్రెస్ రాజా’ ‘కృష్ణార్జున యుద్ధం’ చిత్రాల ద్వారా ప్రతిభావంతుడైన దర్శకుడిగా పేరుతెచ్చుకున్నారు. నితిన్ కథానాయకుడిగా ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘మాస్ట్రో’. హిందీలో విజయవంతమైన ‘అంధాధున్’ రీమేక్ ఇది. ఈ నెల 17న డిస్నీ హాట్స్టార్లో విడుదలకానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మేర్లపాకగాంధీ పాత్రికేయులతో ముచ్చటించారు.
డార్క్హ్యూమర్ నచ్చింది
హిందీ ‘అంధాధున్’ చూసినప్పుడు తెలుగులో ఇలాంటి సినిమాను రీమేక్ చేయాలనిపించింది. నిర్మాత సుధాకర్రెడ్డిగారు నన్ను సంప్రదించినప్పుడు ఆ సినిమా గురించి చెప్పాను. ఓ రీమేక్కు ప్రయత్నిస్తే బాగుంటుందని ఇద్దరం భావించడంతో ఈ సినిమా పట్టాలెక్కింది. కథలోని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ నాకు బాగా నచ్చాయి. క్రైమ్తో పాటు కథలో అంతర్లీనంగా ఉండే డార్క్హ్యూమర్ ఎంతగానో ఆకట్టుకుంది.
మార్పులు చేశాం
తెలుగు నేటివిటీకి అనుగుణంగా కథలో కొన్ని మార్పులు చేశాం. మాతృకలోని ప్రేమకథను కొద్దిగా మార్చాం. పతాకఘట్టాల్లో మరికొంత ఎమోషన్ను జత చేశాం. రీమేక్లు చేయడం అంత సులభం కాదు. యథాతథంగా సినిమా తీస్తే కాపీపేస్ట్ చేశారంటారు. ఏమైనా మార్పులు చేస్తే కథలోని ఆత్మను చెడగొట్టారని విమర్శిస్తారు. మాస్ట్రో అంటే మాస్టర్ ఆఫ్ మ్యూజిక్. ఇందులో హీరో పియానిస్ట్ కాబట్టి ‘మాస్ట్రో’ అనే టైటిల్ను పెట్టాం.
అందుకే టైమ్ తీసుకుంటా
ఈ సినిమాలో నితిన్ అంధుడిగా అద్భుతంగా నటించాడు. తొలుత ఈ చిత్రాన్ని థియేటర్లోనే విడుదల చేద్దామనుకున్నాం. ప్రతికూల పరిస్థితుల కారణంగా ఓటీటీ వైపు మొగ్గు చూపాం. మహతిస్వరసాగర్ సంగీతం కొత్తగా అనిపిస్తుంది. థ్రిల్లిం గ్ సన్నివేశాల్ని ఎలివేట్ చేసేలా ఆయ న బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిం చాడు. భవిష్యత్తులో నితిన్తో స్ట్రెయిట్ సినిమా చేస్తా. స్క్రిప్ట్ రూపకల్పనకు నేను చాలా సమ యం తీసుకుంటా. ఒక్కోసారి కొన్ని కథల్ని మధ్యలో వదిలే యాల్సి వస్తుంది. అందుకే నా కెరీర్లో తక్కువ సినిమాలు చేశాను.