కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ రాహుల్రాజ్
ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి జిల్లాకేంద్రంలో పారిశుధ్యపనుల పరిశీలన
ఆసిఫాబాద్ అంబేద్కర్చౌక్, జూన్ 20 : పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటే రోగాలు దరిచేరవని కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్, ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. ఎమ్మెల్యే ఆత్రం సక్కు, పంచాయతీ అధికారులతో కలిసి జిల్లా కేంద్రంలోని కాలనీల్లో జిల్లాకేంద్రంలో పర్యటించారు. డ్రైనేజీలు , రోడ్లను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలు చెత్తను పంచాయతీ అందజేసిన బుట్టల్లోనే వేయాలన్నారు. వీధులు, పరిసరాలు శుభ్రంగా ఉంటే డెంగీ, మలేరియా వంటి వ్యాధులు దరిచేరకుండా ఉంటాయన్నారు. పారిశుధ్యంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు. డీఎల్పీవో రమేశ్, ఈవో రాజాబాబు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గాదెవేణి మల్లేశ్, మాజీ చైర్మన్ వెంకన్న, మాజీ ఎంపీపీ బాలేశ్గౌడ్. టీఆర్ఎస్ మహిళా నాయకురాలు మంగ, నాయకులు సా లం, శైలేందర్, జావీద్, తదితరులు పాల్గొన్నారు.