సుల్తాన్బజార్,జూలై 8 : ధర్మాస్పత్రిగా పేరుగాంచిన ఉస్మానియా దవాఖానకు ప్రముఖ ఫార్మా కంపెనీ గ్లాండ్ ఫార్మా చేయూతనిచ్చింది. గురువారం గ్లాండ్ ఫార్మా కెప్టెన్ రఘురాం, మేనేజింగ్ ట్రస్టీ గిరీష్రాజులు 10 మల్టీచానల్ మానిటర్లు, సీఆర్ఆర్టీ హెమోడయాఫిల్టరేషన్ మిషన్ను దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్కు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ మాట్లాడుతూ ఉస్మానియాలో చికిత్స పొందుతున్న రోగులకు ఈ యంత్రాలతో మరిన్ని మెరుగైన వైద్య సేవలందించేందుకు కృషి చేస్తామన్నారు. అత్యవసర రోగులకు ఎంతో దోహదం చేసే యంత్రాలను విరాళంగా అందించిన గ్లాండ్ ఫార్మా, బాలవికాస్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శౌరిరెడ్డిలను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో సీఎస్ ఆర్ఎంవో డాక్టర్ శేషాద్రి, ఆర్ఎంవోలు డాక్టర్ సాయిశోభ, డాక్టర్ బండారి శ్రీనివాసులు,డాక్టర్ సిద్దిఖీ, డాక్టర్ అనురాధ, డాక్టర్ మాధురి, డాక్టర్ సుష్మ, డాక్టర్ కవిత పాల్గొన్నారు.