అందోల్, జూలై 6 : పల్లెప్రగతితో మా రుమూల గ్రామాలు సైతం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. పల్లె, పట్టణ ప్రగతి, హారితహారం కార్యక్ర మాల్లో భాగంగా మంగళవారం అందోల్ – జోగిపేట మున్సిపాలిటీ తోపాటు అన్నాసాగర్, రంసాన్పల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పల్లె, పట్టణ ప్రగతి కార్య క్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొన్ని విజయవంతం చేయాలన్నారు. హరితహారంలో భాగంగా ప్రతి కుటుంబానికి ఆరు మొక్క లు అందజేసి, వాటిని నాటి, సంరక్షించేలా ప్రజాప్రతి నిధు లు, అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు. మొక్కలతోనే మనుగడ అనే విషయం ప్రజలకు అర్థమయ్యే లా వివరించాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, ఏఎంసీ చైర్మన్ మల్లికార్జున్, ఎంపీపీ బాలయ్య, జడ్పీటీసీ రమేశ్, మార్క్ఫెడ్ డైరెక్టర్ జగన్మోహన్రెడ్డి, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు వెంకటేశం ఉన్నారు.
పుల్కల్ మండలంలో పర్యటన
పుల్కల్ రూరల్, జూలై 6 : పల్లె ప్రగతితోనే గ్రామాల్లో అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. మండలంలోని కోడూరు, లాల్సింగ్నాయక్తండాల్లో పర్య టించారు. కోడూరులో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డు, వైకుంఠధామాన్ని పరిశీలించి, మొక్కను నాటారు. గ్రామంలో పచ్చదనం – పరిశుభ్రత కార్యక్రమాలను పక డ్బందీగా చేపడుతున్నారని సర్పంచ్ నర్సింహారెడ్డి తోపాటు అధికారులను అభినందించారు. కోడూరులో ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేశారు. లాల్సింగ్నాయక్ తండాలో పర్యటించి, పల్లె ప్రకృతి వనంలో పూలు, పండ్ల మొక్కలను నాటారు. కార్యక్రమాల్లో ఎంపీడీవో మధులత, పీఆర్ఏఈ శశికుమార్, సర్పంచ్ గిరిధర్రాథోడ్ పాల్గొన్నారు.
ఫెన్సింగ్ ఎందుకు వేయలేదు?
చౌటకూర్, జూలై 6 : వైకుంఠధామం చుట్ట్టూ ఫెన్సింగ్ ఎందుకు వేయలేదు? నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలా? అని సర్పంచ్ రాజిరెడ్డిపై ఎమ్మెల్యే ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శివ్వంపేట గ్రామాన్ని సందర్శిం చి, వైకుంఠధామాన్ని పరిశీలించారు. అనంతరం ప్రజలకు మొక్కలను పంపిణీ చేశారు. ఆయన వెంట ఎంపీడీవో మధులత, ఎంపీటీసీ కిరణ్గౌడ్, కో ఆప్షన్ సభ్యుడు అలీం, ఉపసర్పంచ్ దశరథ్, స్థానిక నేత విజయ్కుమార్ ఉన్నారు.