గత సంవత్సర కాలంగా సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖుల మరణాలు గురించి ఎక్కువగా వింటున్నాం. కొందరేమో కరోనాతో మరణిస్తే, మరి కొందరు అనారోగ్యంతో ఇంకొందరు ఆత్మహత్య చేసుకొని కన్నుమూస్తున్నారు. తాజాగా మరాఠీ సినిమా, బుల్లితెర ఆర్ట్ డైరెక్టర్ రాజు సాపతే పుణేలోని తన ఇంట్లో శనివారం ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది.
చలనచిత్ర యూనియన్ అధికారి రాకేష్ మౌర్యా డబ్బులు కోసం వేధిస్తున్నాడని తట్టుకోలేకే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు ఆత్మహత్యకు పాల్పడే ముందు చేసిన సెల్ఫీ వీడియోలో చెప్పుకొచ్చాడు. లాక్ డౌన్ సమయంలోను చాలా బిజీగా ఉన్న రాజు సాపతే గత 22 ఏళ్లుగా సినీ, బుల్లితెర రంగానికి తన సేవలు అందిస్తున్నారు. అగోబాయి సూన్బాయి’, ‘కాయ్ గడ్లా త్యా రాత్రి’, ‘మన్యా ది వండర్ బాయి’, సాంటలోట్’, ‘రాజధాని ఎక్స్ప్రెస్’, మొదలగు సినిమాలకు రాజు ఆర్ట్ డైరెక్టర్గా విధులు నిర్వహించారు. ఆయన మృతితో మరాఠీ సినీ పరిశ్రమలో అలజడి నెలకొంది.