మహబూబాబాద్ : అక్రమంగా తరలిస్తున్న మూడు క్వింటాళ్ల ఎండు గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుల వివరాలను గురువారం డోర్నకల్ పోలీసు స్టేషన్లో ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి వెల్లడించారు. డోర్నకల్ మండల కేంద్రంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా, ట్రాక్టర్ డ్రైవర్, అందులో ఉన్న మరో వ్యక్తి ట్రాక్టర్ దిగి పారిపోతుండగా వారిని పట్టుకున్నారు. ట్రాక్టర్ను తనిఖీ చేయగా ట్రైలర్ కింద ప్రత్యేకంగా అమర్చిన ఒక ప్లేట్పై 150 ప్యాకెట్లలో 3 క్వింటాళ్ల గంజాయి దొరికింది.
పట్టుబడిన వారిలో మరిపెడ మండలం ధర్మమరం తండాకు చెందిన బానోత్ కిరణ్ కుమార్, కొయ్యగూడెంకు చెందిన బదావత్ సూర్య ఉన్నారు. నిందితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చింతూరు మండలంలోని గుర్తు తెలియని వ్యక్తుల నుంచి కేజీ రూ.3000 చొప్పున కొనుగోలు చేసి, మహారాష్ట్రలో కేజీ రూ. 10,000 విక్రయిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్పీ యోగేశ్ గౌతమ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
పరవళ్లు తొక్కుతున్న పొచ్చర జలపాతం
నరసింహులపల్లి సమస్యలను పరిష్కరిస్తా : మంత్రి కొప్పుల
టీఆర్ఎస్ పార్టీలోకి ఎల్ రమణ?
బ్లాక్ ఫంగస్తో హెల్త్ సూపర్ వైజర్ మృతి