చిన్నారి పెళ్లి కూతురు సీరియల్తో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి అవికా గోర్. ఉయ్యాల జంపాల సినిమాతో వెండితెర అరంగేట్రం చేసిన ఈ అమ్మడు తర్వాత పలు సినిమాలు చేసింది. కాకపోతే ఏ సినిమా కూడా పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు. కొద్ది రోజులు గ్యాప్ తీసుకున్నాక మళ్లీ సినిమాలతో బిజీ అయిన అవికా గోర్ తాజాగా తనపై వస్తున్న రూమర్స్పై స్పందించింది.
‘సస్రూల్ సిమర్ కా’ అనే సీరియల్లో మనీష్ రైసింఘన్- అవికా కలిసి పనిచేశారు. వాళ్ళ కెమిస్ట్రీ చూసి వీళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారని, రహస్యంగా బిడ్డకు కూడా జన్మనిచ్చారనే పుకార్లు పుట్టించారు. దీనిపై మండిపడ్డ అవికా తండ్రి వయస్సు ఉన్న వ్యక్తితో పిల్లల్ని కంటారా అంటూ కామెంట్ చేసింది. మిలింద్ చంద్వాణీ అనే యువకుడితో రిలేషన్లో ఉన్నట్లు కన్ఫర్మ్ చేసింది.
ఇక తాజాగా మనీష్ రైసింఘన్ కూడా పుకార్లపై స్పందించాడు. మా ఇద్దరికి 18 సంవత్సరాల తేడా ఉంది. మా మధ్య ఎన్నో సంవత్సరాలుగా స్నేహా బంధం కొనసాగుతుంది. అవికాతో తనకు రిలేషన్ ఉందని వచ్చిన వార్తలు చూసి తన భార్య సంగీత నవ్వుకుందని ఆయన అన్నాడు. కాగా, అవికా ప్రస్తుతం నాగ చైతన్య ‘థాంక్యూ’ సినిమాలో నటిస్తోంది.