కరోనా వలన ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించడంతో సెలబ్రిటీలు అందరు ఫ్యామిలీతో ఆనంద క్షణాలు గడుపుతున్నారు. ఓ వైపు స్టార్స్కు సినిమా షూటింగ్స్ లేవు, మరో వైపు వారి పిల్లలకు స్కూల్స్ లేవు. దీంతో ఇంట్లో అందరు కలిసి తెగ రచ్చ చేస్తున్నారు. తాజాగా మంచు విష్ణు కూతురు అరియానా తన తండ్రికి ఓ ఛాలెంజ్ విసిరింది. గడ్డం తీసేస్తే, నెల రోజులు నీ మాట వింటాను అని తన తాతయ్య మోహన్ బాబు ఆధ్వర్యంలో విష్ణుతో పేర్కొంది.
మంచు విష్ణు గడ్డం చూసి ఇంట్లో చాలా మంది చిరాకు పడుతుండగా, వెంటనే గడ్డం తీసేసాడు. అంతే కాదు నా కుమార్తె నా మాట ఇంత వరకు వినలేదు. గడ్డం తీసేస్తే నెల రోజుల పాటు నేను ఏం చెప్తే అది వింటానంటుంది. ఇంట్లో వాళ్లకు కూడా గడ్డం చిరాకు తెప్పిస్తుంది. అందుకు క్లీన్ షేవ్ చేసుకొని కొత్త లుక్లోకి మారానంటూ విష్ణు చెప్పుకొచ్చాడు. అయితే విష్ణుని కొత్త లుక్లో చూసే సరికి ప్రతి ఒక్కరు స్టన్నింగ్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ తతంగానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.