‘మా’ అధ్యక్ష (Maa Elections) (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్)ఎన్నికల అంశం తెరపైకి వచ్చినప్పటి నుంచి గతంలో ఎన్నడూ లేని విధంగా ఆసక్తికరంగా మారాయి. అక్టోబర్ 10న ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో..అధ్యక్ష ఎన్నికల బరిలో నిలుస్తున్న మంచు విష్ణు (Manchu Vishnu) తన ప్యానెల్ ప్రకటించేందుకు రెడీ అయ్యారు. ‘మా’ ఎన్నికల కోసం మంచు విష్ణు రేపు ఉదయం 11 గంటలకు ప్యానెల్ ప్రకటించబోతున్నట్టు తెలుస్తోంది. ‘మా’ ఎన్నికల్లో అధ్యక్షుడిగా మంచు విష్ణు పోటీ చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం మంచు విష్ణు ప్యానెల్ లో రఘుబాబు (Raghu Babu) జనరల్ సెక్రటరీగా పోటీ చేయనున్నారు. బాబూమోహన్ (Babu Mohan)ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా పోటీ చేయబోతున్నారు.
విష్ణు ప్యానెల్ కు ‘మా’ మాజీ అధ్యక్షుడు నరేశ్ మద్దతు ప్రకటించారు. మంచు విష్ణు తన ప్యానెల్ లో ఎవరెవరికి అవకాశమిస్తారనేది ఇపుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. మా కోసం ప్రత్యేక భవనం ఉండాలనే అంశాన్ని ఎజెండాగా పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు విష్ణు. ఎన్నికల బరిలో నిలుస్తున్న మరో అభ్యర్థి ప్రకాశ్ రాజ్ ఇప్పటికే తన ప్యానెల్ ను ప్రకటించారు. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి జీవితారాజశేఖర్ జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తున్నారు. నిర్మాత బండ్ల గణేశ్ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు.
‘మా’ ఎన్నికల్లో అధ్యక్షపదవి కోసం ప్రధానంగా ప్రకాష్రాజ్, మంచు విష్ణు మధ్యే పోటీ నెలకొంది. అక్టోబర్ 10న ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎన్నికలు నిర్వహించి..అదేరోజు ఫలితాల్నివెల్లడించనున్నారు. ఈ నెల 27 నుంచి 29 వరకు నామినేషన్లను స్వీకరించి..30వ తేదిన వాటిని పరిశీలించనున్నారు. అక్టోబర్ 2 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువుగా నిర్ణయించినట్టు ఎన్నికల అధికారి కృష్ణమోహన్ వెల్లడించారు.
Vikramarkudu sequel |విక్రమార్కుడు సీక్వెల్ దర్శకుడు ఇతడే..!
Regina Cassandra l షాహిద్, రాశీఖన్నాతో జాయిన్ అయిన రెజీనా కసాండ్రా
Tamannaah Bhatia| తన ఆరోగ్య సమస్యను దాచి పెట్టిన తమన్నా..!