మా ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఓటర్లని ఆకర్షించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ సారి విందుల పేరుతో ఓటర్లని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ మధ్య నరేష్ తన ఇంట్లో విందు ఏర్పాటు చేయగా, రీసెంట్గా మా సభ్యులని విందుకు ఆహ్వానించారు ప్రకాశ్ రాజ్. ఆ సమయంలో సభ్యులతో పలు విషయాల గురించి చర్చించారు. ఇక తాజాగా మంచు విష్ణు డిన్నర్ మీట్ పెట్టారు.
మా ఎన్నికల తేదీ దగ్గర పడడంతో మా సభ్యులని ప్రసన్నం చేసుకునేందుకు డిన్నర్ మీట్లని ఏర్పాటు చేస్తున్నారు. ప్రకాశ్ రాజ్ నిర్వహించిన సమావేశంలో సుమారు 100 మంది నటీనటులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మా ఎన్నికల ప్రణాళిక, సభ్యుల సంక్షేమంపై ప్రకాశ్ రాజ్ చర్చించారు. విష్ణు కూడా భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించినట్టు తెలుస్తుంది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్( మా ) ఎన్నికల అక్టోబరు 10న జరగనుండగా, ఈ పోటీలో సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత రాజశేఖర్, హేమ , సీవీఎల్ నరసింహా రావు, ఓ కళ్యాణ్ లు పోటీ చేయనున్నారు. విష్ణు,ప్రకాశ్ రాజ్ మధ్యనే పోటీ ఆసక్తికరంగా ఉండనుంది.