అక్టోబర్10న జరగనున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు రసవత్తరంగా సాగనున్నాయని తెలుస్తుంది. ‘మా’ ఎన్నికల్లో అధ్యక్షుడి కోసం ప్రకాశ్రాజ్, మంచు విష్ణు, సీవీఎల్ నర్సింహరావు పోటీ పడుతున్నారు. గతంలో హేమ, జీవితలు కూడా అధ్యక్ష బరిలో నిలవగా, వారు ప్రకాశ్ రాజ్ ప్యానెల్లో చేరారు. అయితే మా పోటీలో ప్రకాశ్ రాజ్ విష్ణుల మధ్య పోటీ ఆసక్తికరంగా సాగనుంది.
అక్టోబర్ 10 ఆదివారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ హైదరాబాద్ జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో పోలింగ్ జరగనుంది. అదే రోజు ఫలితాలను ప్రకటించనున్నారు. అధ్యక్ష బరిలో పోటీ చేస్తున్న ప్రకాశ్ రాజ్ ఇప్పటికే తన ప్యానెల్ సభ్యులను ప్రకటించగా, తాజాగా మంచు విష్ణు ప్రకటించాడు.
మంచు విష్ణు అధ్యక్షుడిగా పోటీ చేయనుండగా, రఘు బాబు జనరల్ సెక్రటరీ, బాబు మోహన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, మాదాల రవి – వైస్ ప్రెసిడెంట్, పృథ్వీరాజ్ బాలిరెడ్డి – వైస్ ప్రెసిడెంట్, శివబాలాజీ – కోశాధికారి, కరాటే కల్యాణి -జాయింట్ సెక్రటరీ, గౌతమ్ రాజు-జాయింట్ సెక్రటరీ పదవుల కోసం పోటీ చేయనున్నారు.
‘మా’ కోసం మనమందరం
ఎగ్జిక్యూటివ్ మెంబర్లు
ప్రకాశ్ రాజ్ ప్యానెల్కు దీటుగా మంచు విష్ణు ప్యానెల్ ఉండగా, పోటీ ఆసక్తికరంగానే సాగనున్నట్టు తెలుస్తుంది.