హైదరాబాద్ : ఉత్తర, వాయువ్య దిశలనుంచి తక్కువ ఎత్తులో తెలంగాణ వైపు వేడి గాలులు వీస్తున్నాయి. దీంతో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్నగర్, నాగర్కర్నూలు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం వడగాడ్పులు వీచాయి. భద్రాచలంలో అత్యధికంగా 42.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డయింది. ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబ్నగర్, మెదక్, నల్లగొండ, నిజామాబాద్, రామగుండంల్లో 40– 42 డిగ్రీల మధ్య నమోదయ్యాయి.
ఆది, సోమవారాల్లో పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. ఖమ్మంలో సాధారణం కంటే 5 డిగ్రీల వరకు ఎక్కువగా నమోదవుతున్నట్టు చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్లో 39.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.