హైదరాబాద్: రాష్ట్ర ఎనిమిదో అవతరణ దినోత్సవం సందర్భంగా అసెంబ్లీలో వేడుకలు నిర్వహించారు. శాసనమండలిలో మండలి ప్రాంగణంలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అసెంబ్లీలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ సెక్రెటరీ నర్సింహా చార్యులు, టీఆర్ఎస్ఎల్పీ కార్యదర్శి రమేష్ రెడ్డి, అసెంబ్లీ, మండలి ఉద్యోగులు పాల్గొన్నారు.