కరోనా ప్రజల జీవితాల్లో తీసుకొచ్చిన మార్పులను వినోదాత్మక కోణంలో ఆవిష్కరిస్తూ రూపొందించిన చిత్రం ‘మంచిరోజులు వచ్చాయి’. మారుతి దర్శకుడు. సంతోష్శోభన్, మెహరీన్ జంటగా నటించారు. వి.సెల్యూలాయిడ్, ఎస్.కె.ఎన్ నిర్మాతలు. దీపావళి కానుకగా నవంబర్ 4న విడుదలకానుంది. ‘కరోనానంతర పరిస్థితులను హాస్య ప్రధానంగా ఆవిష్కరించే చిత్రమిది. ఆద్యంతం వినోదభరితంగా ఆకట్టుకుంటుంది’ అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి కెమెరా: సాయిశ్రీరామ్, సంగీతం: అనూప్రూబెన్స్.