టాలీవుడ్ (TOLLYWOOD) యాక్టర్లు నాగశౌర్య (Naga Shaurya), రీతూవర్మ(Ritu Varma) కాంబినేషన్ లో వస్తున్న చిత్రం వరుడు కావలెను. లక్ష్మీ సౌజన్య (Lakshmi Sowjanya) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నుంచి కూల్ అండ్ మెలోడీగా సాగే పాటను మేకర్స్ విడుదల చేశారు. మనసులోనే నిలిచిపోకే (Manasulone Nilichipoke) మైమరుపుల మధురిమ..పెదవి దాటి వెలికి రాక బెదురెందుకె హృదయమా అంటూ నాగశౌర్య, రీతూ వర్మ మధ్య నడిచే ఈ పాట కూల్ , మెలోడియెస్ గా సాగిపోతూ సంగీత ప్రియులను మైమరిపింపజేస్తుంది.
రీతూవర్మ, నాగశౌర్య ఒకరిపై ఒకరు తమ భావాలను వ్యక్తపరచలేకపోతున్నట్టు పాడుకుంటున్నట్టుగా కనిపిస్తున్న తాజా పాటలో ఇద్దరి మధ్య అద్బుతమైన కెమిస్ట్ర్రీ కనిపిస్తోంది. తెలుగుదనంతో, అద్బుతమైన విలువలతో కూడిన పాటలు రాయడంలో దిట్ట సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఆయన కలం నుంచి జాలువారిన ఈ గీతం వరుడు కావలెను సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ పాటకు చిన్మయి గాత్రం ప్రాణం పోసిందనే చెప్పాలి.
రీతూవర్మ సంప్రదాయ చీరకట్టులో తెలుగుదనం ఉట్టిపడేలా అందరినీ కట్టిపడేస్తుండగా..నాగశౌర్య ఫార్మల్ లుక్ లో కనిపిస్తూ సందడి చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు మంచి స్పందన వచ్చింది.
Vikramarkudu sequel |విక్రమార్కుడు సీక్వెల్ దర్శకుడు ఇతడే..!
Regina Cassandra l షాహిద్, రాశీఖన్నాతో జాయిన్ అయిన రెజీనా కసాండ్రా
Tamannaah Bhatia| తన ఆరోగ్య సమస్యను దాచి పెట్టిన తమన్నా..!