కథానాయకుడు మమ్ముట్టి నటించిన మలయాళ చిత్రం ‘మాస్టర్ పీస్’ను తెలుగులో ‘గ్రేట్ శంకర్’పేరుతో విడుదల చేస్తున్నారు నిర్మాత లగడపాటి శ్రీనివాస్. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం విశేషాలను నిర్మాత తెలియజేస్తూ ‘మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్కుమార్ పవర్ఫుల్ ఏసీపీ పాత్రలో కనిపిస్తారు. అత్యంత ఉత్కంఠభరితంగా సాగే కథనంతో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు కూడా నచ్చుతుందనే నమ్మకం వుంది’ అన్నారు.