ఇండస్ట్రీలో చోటు చేసుకుంటున్న వరుస విషాదాలు అభిమానులని శోక సంద్రంలో ముంచెత్తుతున్నాయి. హీరోలు, హీరోయిన్స్, కమెడీయన్స్ , సింగర్స్ ఇలా పలువురు సినీ ప్రముఖుల వరుస మరణాలు బాధిస్తున్నాయి. తాజాగా మలయాళ చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు రిజబావా కిడ్నీ సంబంధిత వ్యాధితో కన్నుమూసారు.
కొచ్చిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో కొద్ది రోజులుగా చికిత్స పొందుతున్న రిజబావా(55) సోమవారం కన్నుమూసారు. 90వ దశకంలో మలయాళ సినీ ఇండస్ట్రీలో విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పలు చిత్రాల్లో తన నటనతో ఆకట్టుకున్నారు. రిజబావా మృతి పట్ల మలయాళ చిత్ర పరిశ్రమతో పాటు రాజకీయ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.
దాదాపు 150 చిత్రాలలో నటించిన ఆయన పలు సీరియల్స్లోను నటించి అలరించాడు. 1990లో షాజీ కైలాస్ డైరెక్షన్లో తెరకెక్కించిన ‘డాక్టర్ పశుపతి’ చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యారు. విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, కమెడియన్గా ప్రేక్షకులని పలకరించిన ఆయన చివరిగా మమ్ముట్టి హీరోగా తెరకెక్కిన ‘వన్’ చిత్రంలో నటించి మెప్పించారు.