మేజర్ ప్రయాణం

26/11 ముంబయి ఉగ్రవాద దాడుల్లో వీరమరణం పొందిన ఆర్మీ మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత ఆధారంగా రూపొదుతున్న చిత్రం ‘మేజర్'. అడివి శేష్ టైటిల్ పాత్రలో నటిస్తున్నారు. శశికిరణ్ తిక్కా దర్శకుడు. జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. శోభితా దూళిపాళ్ల, సయీ మంజ్రేకర్ కీలక పాత్రధారులు. ‘మేజర్' లుక్ టెస్ట్ వీడియోను శుక్రవారం హీరో మహేష్బాబు విడుదలచేశారు. ఈ వీడియోలో లుక్ టెస్ట్ కోసం సాగించిన ప్రయాణాన్ని అడివి శేష్ వివరిస్తూ ‘చేయాలనుకున్న పని మీద ఉన్న నమ్మకం, ఆ పని చేసేటప్పుడు మనలోని నిజాయితీ ఇవి రెండు మేజర్ సందీప్ లక్షణాలు. వాటిని నమ్ముకొని లుక్ టెస్ట్కు వెళ్లి ఫొటో దిగాను. 26/11 దాడుల్లో మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ మరణించిన సమయంలో టీవీల్లో వచ్చిన ఆయన ఫొటో చూశాను. ఆ కళ్లలో నాకు తపన కనిపించింది. ఆయన గురించి తెలుసుకోవాలనే ఆసక్తి నుంచి ఈ సినిమా మొదలైంది. సందీప్ తల్లిదండ్రులను కలిసి అతడికి సంబంధించిన చాలా విషయాల్ని తెలుసుకున్నా. ఓ సందర్భంలో నిన్ను చూస్తుంటే సందీప్ గుర్తొస్తున్నాడని అతడి తల్లిదండ్రులు నాతో చెప్పారు. ఆ క్షణమే సందీప్ కథతో సినిమా చేయడానికి అంగీకారం దొరికిందని అర్థమైంది. మహేష్బాబు, అనురాగ్శరత్, సోనీ పిక్చర్స్ సహకారంతో తెలుగు, హిందీ భాషల్లో పాన్ ఇండియన్ స్థాయిలో ఈ సినిమాను రూపొందిస్తున్నాం’ అని తెలిపారు. ఈ సినిమా ఫస్ట్లుక్ను డిసెంబర్ 17న విడుదల చేయనున్నారు.
తాజావార్తలు
- ఎమ్మెల్సీగా గెలిపిస్తే మీ గొంతుకనవుతా: వాణీదేవి
- డీఎంకేతో పొసగని కాంగ్రెస్ పొత్తు.. కూటమిలో కొనసాగేనా?
- లంచ్ టైమ్.. ఇంగ్లండ్ 74/3
- హీరోని చూసేందుకు నీళ్ళల్లోకి దూకిన అభిమాని
- విరాట్ కోహ్లి vs బెన్ స్టోక్స్.. నాలుగో టెస్ట్లో గొడవ.. వీడియో
- వావ్ పొలార్డ్.. ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు.. వీడియో
- జార్ఖండ్లో ఐఈడీ పేలుడు.. ఇద్దరు జవాన్లు మృతి
- తాజ్మహల్కు బాంబు బెదిరింపు
- గుడ్ న్యూస్ చెప్పిన శ్రేయా ఘోషాల్
- భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు