మహేశ్ బాబు (Mahesh Babu) నటిస్తోన్న లేటెస్ట్ ప్రాజెక్టు సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata). యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ చిత్రాన్ని పరశురాం డైరెక్ట్ చేస్తున్నాడు. కొంతకాలంగా పరశురాం అండ్ టీం షూటింగ్ కోసం గోవా (Goa) లో ఉంది. అక్కడ వేసిన స్పెషల్ సెట్స్ లో కీలక షెడ్యూల్ ను పూర్తి చేశారు. 2 వారాలపాటు జరిపిన చిత్రీకరణలో డైరెక్టర్ పరశురాం మహేశ్ బాబు, కీర్తిసురేశ్, లీడ్ యాక్టర్లపై వచ్చే హై ఓల్టేజీ యాక్షన్ సీన్లను పూర్తిచేశారు. అనంతరం మహేశ్ బాబు హైదరాబాద్ కు తిరిగొచ్చేశాడు.
మహేశ్ బాబు తన సోదరి మంజుల, స్నేహితుడు వంశీ పైడిపల్లితో కలిసి చార్టెడ్ ఫ్లైట్ లో ఇవాళ ఉదయం హైదరాబాద్ కు చేరుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలను నమ్రతా శిరోద్కర్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా..నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. సర్కారు వారి పాట మేజర్ షెడ్యూల్ ను సెప్టెంబర్ మొదటి వారంలో హైదరాబాద్ లో షురూ చేయనున్నారు. 2022 సంక్రాంతి కానుకగా ఈ సినిమా థియేటర్లలో సందడి చేయబోతుంది.
మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. సర్కారు వారి పాటలో కీర్తిసురేశ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ చిత్రం పూర్తవగానే త్రివిక్రమ్ తో సినిమా చేయనున్నాడు మహేశ్ బాబు.
ఇవికూడా చదవండి..
Chiranjeevi | బాబీ చిత్రంలో చిరంజీవి రోల్ తెలిసిపోయింది..!
Seetimaarr |ఈల వేసేందుకు గోపీచంద్ రెడీ..సీటీమార్ రిలీజ్ డేట్ ఫిక్స్
Chiranjeevi |ముఠామేస్త్రి స్టైల్ లో చిరంజీవి..షేర్ చేసిన బాబీ