హైదరాబాద్: కరోనా నేపథ్యంలో రేషన్ బియ్యం కోటా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఐదు కిలోల బియ్యంతో కలిపి రేషన్ కార్డు ఉన్న కుటుంబంలోని ఒక్కొక్కరికి 10 కిలోల చొప్పున మే నెల కోటా బియ్యం ఇవ్వనుంది. ఈ మేరకు వచ్చే నెలకు సంబంధించిన కోటాను విడుదల చేసింది. జూన్ నెలలో కూడా ఇదే విధంగా పంపిణీ చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 82.50 లక్షల రేషన్ కార్డుదారులకు 1.75 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..