కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్స్లోకి వచ్చి తెగ సందడి చేస్తున్న చిత్రం లవ్ స్టోరీ. అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఫీల్ గుడ్ చిత్రాల స్పెషలిస్ట్ శేఖర్ కమ్ముల తెరెక్కిన ఈ చిత్రం బాక్సీఫీస్ దగ్గర కనక వర్షం కురిపిస్తుంది. ఫస్టాఫ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ పంచుతూ సెకండాఫ్కి వచ్చే సరికి కథపై గ్రిప్పింగ్ తీసుకొచ్చి బాగా ప్రెజెంట్ చేశారనే టాక్ వస్తోంది.
లీడ్ పెయిర్ అయిన నాగ చైతన్య, సాయి పల్లవి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని, ఈ లవ్ స్టోరీకి సాయి పల్లవి డాన్స్, మ్యూజిక్ స్పెషల్ అసెట్ అనే ట్వీట్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. తాజాగా ఈ చిత్రంపై మహేష్ తన అభిప్రాయం తెలియజేశాడు. తాజాగా లవ్స్టోరీ సినిమాని వీక్షించి స్పందించిన సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రశంసలు గుప్పించాడు.
శేఖర్ కమ్ముల చిత్రాన్ని బాగా తెరకెక్కించాడని ప్రశంసలు కురిపిస్తూ.. చైతూ నటుడిగా చాలా ఎదిగాడు. పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. సాయి పల్లవి తెరపై మ్యాజిక్ చేసింది. ఆమెలా డ్యాన్స్ చేసే వారిని చూడలేదని ఒక కలలా ఆమె కదులుతుందని అన్నారు. ఇక పవన్ సీహెచ్ మ్యూజిక్ స్కోర్ సంచలనమని, రెహమాన్ సార్ శిష్యుడు పవన్ అని విన్నానని మహేష్ తన ట్వీట్లో పేర్కొన్నాడు. రెహమాన్ సర్ గర్వపడే సమయం ఇది అని మహేష్ స్పష్టం చేశారు. నిర్మాతలు నారాయణ్ దాస్ కె. నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు గార్లకి అభినందనలు తెలియచేశారు.