లక్నో: ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్కు కరోనా వైరస్ సంక్రమించింది. కరోనా పరీక్షలో పాజిటివ్గా తేలినట్లు ఆయన తన ట్విట్టర్లో వెల్లడించారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్లో ఉన్నట్లు అఖిలేశ్ వెల్లడించారు. గత కొన్ని రోజుల నుంచి తనతో టచ్లో ఉన్నవారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. కొన్ని రోజుల నుంచి ఆయన జ్వరంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కరోనా పరీక్షల కోసం శ్యాంపిల్ ఇచ్చారు. ఇవాళ ఉదయం ఆ శ్యాంపిల్ రిజల్ట్ వచ్చింది. దాంట్లో పాజిటివ్గా తేలడంతో ఆయన ఐసోలేషన్లోకి వెళ్లారు.