సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ పర్సన్ అనే సంగతి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మాములు సమయంలోనే ఫ్యామిలీతో ఎక్కువగా గడిపే మహేష్ ఇప్పుడు కరోనా వలన ఇంటికి పరిమితం కావడంతో పిల్లలతో ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు.అప్పుడప్పుడు నమత్ర తన ఇన్స్టాగ్రామ్ ద్వారా మహేష్కి సంబంధించిన అప్డేట్స్ని షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా తన కూతురు సితారతో మహేష్ చిల్ అవుతున్న ఫోటోని షేర్ చేసింది. ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ప్రస్తుతం మహేష్ ..పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా బ్యాంక్ కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కుతుంది. కరోనా వలన ఆగిన ఈ చిత్ర షూటింగ్ జూలై నుండి జరగనుంది.ఒకసారి షూటింగ్ మొదలైతే మేకర్స్ మూవీకి సంబంధించిన అప్డేట్స్ని ఒక్కొక్కటిగా విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటించనుంది.